నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావుకు మాతృవియోగం..

నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ కార్యదర్శి పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు మాతృమూర్తి పుస్కూర్ కమలాదేవి (93) సోమవారం కన్నుమూశారు.

Tfi

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు(సోమవారం) ఉదయం మంచిర్యాలలో తుదిశ్వాస విడిచారు. కాగా, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ‘లక్ష్య’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో పాటు.. ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ప్రారంభమైన చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.