Tollywood: టాలీవుడ్ నిర్మాత గుండెపోటుతో మృతి.. నారా రోహిత్ దిగ్ర్భాంతి!

Tollywood: నారా రోహిత్ రౌడీ ఫెలో, నిఖిల్‌తో స్వామి రారా, వీడు తేడా చిత్రాల‌ను నిర్మించిన సినీ నిర్మాత కొర‌టాల సందీప్ (39)గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం తెల్ల‌వారుజామున బాపట్ల‌లోని త‌న నివాసంలో ఉన్న సందీప్ ఒక్క‌సారిగా గుండెపోటుతో కుప్ప‌కూలారు. వెంట‌నే ఆయ‌న్ను కుటుంబ‌స‌భ్యులు ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్టు వైద్యులు ధ్రువీక‌రించారు.

Tollywood

స్వ‌గ్రామ‌మైన పూండ్ల‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఆయ‌న మృతి విష‌యం తెలిసి Tollywoodసినీ ప‌రిశ్ర‌మ దిగ్ర్భాంతికి గురైంది. సందీప్ మృతికి నారా రోహిత్‌, Tollywoodడైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ సంతాపం వ్య‌క్తం చేశారు.. ఆయ‌న‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేర‌కు నారా రోహిత్ ట్వీట్ చేశారు.. సందీప్ ఇక లేర‌న్న విష‌యం త‌న‌ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింద‌ని ట్వీట్ చేశారు. ‌