టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ హీరో మృతి

ప్రముఖ టాలీవుడ్ నటుడు యాధాకృష్ణ కన్నుముశారు. బుధవారం గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 61 సంవత్సరాలు. 20కి పైగా సినిమాల్లో హీరోగా ఆయన నటించారు. అలాగే అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి.

yadakrishna

యాధాకృష్ణ మృతితో బంధువులు, కుటుంసభ సభ్యులు శోకసంద్రంలో ముగినిపోయారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మనోధైర్యంతో ఉండాలని కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతున్నారు. చివరిగా 2011లో వచ్చిన సంక్రాంతి అల్లుడు సినిమాలో యాధాకృష్ణ నటించాడు.

వీవీవీ సత్యనారాయణ ఈ సినిమాను దర్శకత్వం వహించగా. ఇందులో యాధాకృష్ణతో సునాక్షి భరద్వాజ్ కలిసి నటించింది. ఇందులో ఏవీఎస్, రేష్మీ, సుధ, కవిత, జీవి పాలు కీలక పాత్రలలో నటించారు.