BREAKING: డైరెక్టర్ క్రిష్‌కు కరోనా?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో క్రిష్ చేయనున్న సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. జనవరి 4న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ఇటీవలే సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో కరోనా టెస్టు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో పవన్ సినిమా షూటింగ్ ఆగిపోయే అవకాశముంది.

krish jagarlamudi tests corona
krish jagarlamudi tests corona

ఇప్పటికే టాలీవుడ్‌లో పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళికి గతంలో కరోనా రాగా.. కోలుకుని బయటపడ్డారు. ఇక ఇటీవల రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా సోకగా… ప్రస్తుతం వారిద్దరు హోం క్వారంటైన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక హీరోయిన్లలో తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్నారు.

లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఇటీవలే షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో షూటింగ్స్‌లలో పాల్గొంటూ సెలబ్రెటీలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ లోపు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటంతో షూటింగ్‌లు నిలిచిపోతున్నాయి.