Tollywood: టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. వేదం న‌టుడు నాగ‌య్య మృతి!

Tollywood: అల్లు అర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి కాంబినేష‌న్‌లో వేదం చిత్రం తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న విజ‌యం సాధించింది. ఎంతో గుర్తింపు కూడా తీసుకొచ్చింది ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టుల‌కు. ముఖ్యంగా ఈ సినిమాల్లో ముస‌లాయ‌న నాగ‌య్య ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో ఓ బాలుడికి రాములు తాత పాత్ర‌ల్లో న‌టించారు నాగ‌య్య‌.. ఈ తాత‌నే ఇక లేరు.. ఆనారోగ్యంతో వేదం తాత నాగ‌య్య క‌న్నుమూశారు.

Tollywood

దీంతో ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు Tollywood సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో ఆయ‌న భార్య ఆ మ‌ధ్య క‌న్నుమూశారు. దీంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ.ల‌క్ష ఆర్థిక సాయం చేశారు. అలాగే మా అసోసియేష‌న్ నెల‌కు రూ.2500 ఫించ‌న్‌ను ఆయ‌న‌కు ఇస్తుంది. నాగ‌య్య స్వ‌స్థ‌లం గుంటూరు జిల్లా, న‌ర్స‌రావు పేటలోని దేస‌వ‌రం పేట. నాగ‌య్య దాదాపు 30పైగా సినిమాల్లో న‌టించాడు.. లీడ‌ర్‌, నాగ‌వ‌ల్లి, రామ‌య్య వ‌స్తావ‌య్యా, స్పైడ‌ర్ వంటి సినిమాల్లో న‌టించిTollywood టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ‌య్య‌.