టాలీవుడ్ ప్రముఖ నటుడు రావి కొండలరావు కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు రావి కొండలరావు తుది శ్వాస విడిచారు. 88 ఏళ్ల వయసు గల ఆయన దాదాపు 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కొద్దీ సేపటి క్రితమే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన దాదాపు 600కి పైగా సినిమాల్లో నటించారు.

తేనే మనసులు, అలిబాబా 40 దొంగలు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొండలరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన భార్య రాధ కుమారి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారే. అయితే ఆమె 2012లోనే మరణించారు. ఆయన భార్యతో కలిసి వృద్ధ దంపతులుగా చాలా సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా వరుడు, ఓయ్, కింగ్ వంటి సినిమాల్లో వారు చేసిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది. కొండలరావు మృతి చెందడం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.