Tollywood: నేడు వ‌ర‌ల‌క్ష్మీ బ‌ర్త్‌డే.. ఈ సారి దెయ్యం పాత్ర‌లో..

Tollywood: నేడు ప్ర‌ముఖ త‌మిళ్ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. త‌మిళ్‌తో పాటు తెలుగులో కూడా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. సంక్రాంతి కానుక‌గా ర‌వితేజ నటించిన క్రాక్ చిత్రం విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీని కురిపించింది. ఈ చిత్రం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ Tollywood సినిమాలో జ‌య‌మ్మ పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. దీంతో ప్రేక్ష‌కుల మ‌దిలో జ‌య‌మ్మ‌గా ఉండేలా త‌న న‌ట‌న‌ను ఈ చిత్రంలో ప్ర‌ద‌ర్శించింది వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌.

అనంత‌రం అల్ల‌రి న‌రేశ్ న‌టించిన నాంది చిత్రంలో లాయ‌ర్ పాత్ర‌ను పోషించిన వ‌ర‌ల‌క్ష్మీ.. ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. ఓ వైపు నెగెటివ్ పాత్ర‌లు చేస్తూ, మ‌రోవైపు పాజిటివ్ రోల్స్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేసింది వ‌ర‌ల‌క్ష్మీ. ఇక ఈ రోజు ఆమె జ‌న్మ‌దిన సంద‌ర్భంగా మ‌రో తెలుగు సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు.. ఇది హార్ర‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి ర‌చయిత డార్లింగ్ స్వామి ద‌ర్శ‌క‌త్వంలో.. Tollywood ప్ర‌ముఖ నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. హావీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న ఈ సినిమా కోనేరు కాంచ‌న నిర్మించ‌నున్నారు. ముర‌ళీ కృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇంకా ఈ చిత్ర పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని Tollywood చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.