Tollywood: నేడు న‌టి రీతూ వ‌ర్మ బ‌ర్త్‌డే.. ట‌క్ జ‌గ‌దీశ్ టీం విషెస్‌!

Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ హీరోయిన్ రీతూ వ‌ర్మ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె హీరోయిన్‌గా న‌టిస్తున్న ట‌క్ జ‌గ‌దీశ్ మూవీ టీం పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇందులో నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేశ్ హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వహించ‌గా.. షైన్ స్ర్కీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది ఈ Tollywood చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా నేడు హీరోయిన్ రీతూ వ‌ర్మ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. Tollywood చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఆ పోస్ట‌ర్లో రీతూ వ‌ర్మ నుదుటిపై పెద్ద‌గా బొట్టు పెట్టుకుని నానిని చూసి ఎమోష‌న‌ల్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇందులో గుమ్మ‌డి వ‌ర‌ల‌క్ష్మీ అనే పాత్ర‌లో న‌టిస్తుంది. ఇక ఈ Tollywood చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.