Thala Ajith:విద్య‌ కోసం ఇడ్లీలు అమ్ముకునే వ్య‌క్తికి అజిత్ ల‌క్ష విరాళం!

Thala Ajith: హీరో అజిత్‌కుమార్‌.. కోలివుడ్ సూప‌ర్‌స్టార్స్ ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ల త‌ర్వాత అంత పేరున్న న‌టుడు. బాక్సఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసే స‌త్తా ఉన్న న‌టుడు తాలా అజిత్‌. అజిత్ న‌టించిన చివ‌రి చిత్రం నేర్కొండ పార్వె సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు అజిత్ న‌టిస్తోన్న తాజా చిత్రం హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో వా‌లిమై అనే సినిమాలో న‌టిస్తున్నారు. అజిత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే హైద‌రాబాద్ శివార్ల‌లో షూటింగ్ జ‌రిగింది.

Ajith valimai shoot

ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి హైద‌రాబాద్‌కు బైక్‌పై వెళ్లారు. అజిత్ బిఎండ‌బ్ల్యూ బైక్ న‌డుపుతూ.. వాలిమై చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా హైద‌రాబాద్ ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని త‌న బైక్‌పై చెన్నైకి తిరుగు ప్ర‌యాణం కాగా.‌. ఈ క్ర‌మంలోనే రోడ్డు మార్గాన వెళ్తుండ‌గా.. రోడ్డు ప‌క్క‌న ఓ ఇడ్లీ బండి ద‌గ్గ‌ర ఇడ్లీలు తిన్నారు Thala Ajith:అజిత్‌. అనంత‌రం ఇడ్లీలు అమ్ముకునే ఆ యువ‌కుడిని చూసి అజిత్ ఎంతో చ‌లించిపోయాడు. పైచ‌దువుల కోసం ఇలా ఇడ్లీలు అమ్ముతున్నాని Thala Ajith:అజిత్‌కు చెప్ప‌గానే.. వెంట‌నే ఒక ల‌క్ష రూపాయలు విరాళం ఆ యువ‌కుడికి అందించాడు. ఇక అజిత్ న‌టిస్తున్న వాలిమై చిత్రాన్ని ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మిస్తుండ‌గా.. బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి అజిత్‌కు జోడీగా న‌టిస్తోంది.