వినాయకచవితి వేడుకలో TFPC సెక్రటరీ మోహన్ వడ్లపట్ల

కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు వినాయకచవితి వేడుకలను చాలా వరకు సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినీ ప్రముఖులు కూడా ఇంట్లోనే ఉంటూ చాలా నిరాడంబరంగా పూజా కార్యక్రమాలతో గణనాథుడిని స్మరించుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్(TFPC) సెక్రటరీస్ లో ఒకరైన మోహన్ వడ్లపట్ల గారు కూడా తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలసి వినాయక చతుర్దతి వేడుకలను నిర్వహించారు.

ప్రస్తుతం పర్యావరణ సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మట్టి గణపతితో నవరాత్రి వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ఈ కష్టకాలం నుంచి వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు బయటపడాలని, మళ్ళీ షూటింగ్స్ మొదలై సినీ కార్మికులు కూడా పనులతో బిజీ అవ్వాలని పూజా కార్యక్రమాలు జరిపారు. మోహన్ వడ్లపట్ల ‘భూమిక మల్లెపువ్వు’, ‘పోసాని మెంటల్ కృష్ణ’, ‘కలర్స్ స్వాతి కలవరమయే మదిలో’ వంటి డిఫరెంట్ సినిమాలని నిర్మించిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా లవ్ ట్వంటీ20 అనే సినిమా నిర్మించిన మోహన్ వడ్లపట్ల త్వరలోనే ఒక కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆ సినిమాకు బాహుబలి డైలాగ్ రైటర్ జి.అజయ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇది కంటెంట్ బేస్డ్ మూవీ, సస్పెన్స్ & థ్రిల్లింగ్ స్టోరీ, చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్, టాప్ 5 ప్రధాన నటీ నటులు బాలీవుడ్, టాలీవుడ్ మరియు కోలీవుడ్ నుండి నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియన్ చిత్రమని సమాచారం.