
తెలుగు సినిమా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కలిసి సినిమాను కాపాడుకోవాలని అన్నారు నిర్మాత ఎస్ కేఎన్. ఈ రోజు ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఘటికాచలం సినిమా ట్రైలర్ లాంఛ్ లో గెస్ట్ గా పాల్గొన్నారు ఎస్ కేఎన్. ఈ ఈవెంట్ క్యూ అండ్ ఏ లో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ థియేటర్స్ బంద్, రివ్యూస్, ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితిపై తనదైన శైలిలో స్పందించి ఆకట్టుకున్నారు ఎస్ కేఎన్. ఆయన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం తగ్గిపోయింది. ఇందుకు టికెట్ రేట్స్, పాప్ కార్న్ ధరలు, వారమంతా ఒకే టికెట్ ధరలు ఉండటం..ఇలా అనేక కారణాలు ఉన్నాయి. వీక్ డేస్ లో ఒక రేట్, వీకెండ్ లో మరోలా టికెట్ రేట్స్ పెట్టుకుంటే ఆడియెన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించవచ్చు. ప్రేక్షకుల మీద భారం వేయకుండా వారికి వీలైనంత తక్కువలో ఎలా వినోదం అందిస్తామనేది ఆలోచించాలి. చిత్ర పరిశ్రమలోని గౌరవ పెద్దలంతా ఈ సమస్యల మీద ముందు దృష్టి సారించాలి. ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తే ఎగ్జిబిటర్స్ బాగుంటారు. వారి సమస్యలు పరిష్కారమవుతాయి. అందరికీ ఆదాయం లభిస్తుంది. అత్యవసరంగా ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ కు ఫేషియల్ చేస్తామని ఎవరూ అనరూ. బతికించాలని ప్రయత్నిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న మన తెలుగు సినిమాను బతికించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరో ఒకరు అమెరికాలో ఓ పది మంది ఉన్న థియేటర్ లో ఎర్లీ మార్నింగ్ షో చూసి రివ్యూ ఇస్తారు. కానీ నిండుగా ఉన్న థియేటర్ లో ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తేనే ఆ రియల్ రెస్పాన్స్ తెలుస్తుంది. రివ్యూస్ ను ఎవరూ ఆపలేరు. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. కానీ సినిమా ఇండస్ట్రీలో మనమంతా భాగమేనని రివ్యూయర్స్ ఆలోచించాలి. మన సినిమాను బతికించుకునేందుకు మనమంతా ఒక్కటిగా ప్రయత్నించాలి. అన్నారు.