రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న “తీరం” మోషన్ పోస్టర్ విడుదల

అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరో, హీరోయిన్లుగా  అనిల్ ఇనమడుగు దర్శక,నిర్మాతగా రూపొందిస్తున్న రొమాంటిక్  థ్రిల్లర్ చిత్రం “తీరం”. ఈ చిత్రం టైటిల్,  మోషన్ పోస్టర్ ను మే 30న హైదరాబాద్  ఫిలిం నగర్లోని దైవ సన్నిధానంలో చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  తీరం సినిమా హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, మై విలేజ్ షో అనిల్, అజయ్ సన్నపు, విజయం పన్నేరు, అజస్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ- ‘ పూర్తి స్థాయి సంగీతం మరియు సస్పెన్స్ తో  కూడిన రొమాంటిక్  ప్రేమకథాచిత్రంగా తీరం సినిమాని రూపొందించాం.  సినిమా అంతా  ఒక హృద్యమైన మ్యూజికల్ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుంది. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు అంతర్లీనంగా కామిడీ  కొనసాగుతూ, ప్రస్తుతం యువతరానికి పూర్తి స్థాయిలో నచ్చేలా తీరం ఉండబోతుంది. ప్రముఖ గాయకులు  స్వర్గీయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు, తను అనారోగ్యానికి గురికావడానికి  మూడు రోజులు ముందుగా చెన్నైలోని కోదండఫాణి సినీ స్టూడియోలో  మా తీరం చిత్రం కోసం “ఏంటీ ప్రేమా” అనే పాట పాడారు. అది సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.. అన్నారు.