తాప్సి ఎఫెక్ట్.. కంగానపై తీవ్ర విమర్శలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి కూడా అతని మరణం వెనుక అసలు కారణం తెలియాలి అని కంగనా రనౌత్ ఒక పోరాటం చేస్తుందనే చెప్పాలి. బాలీవుడ్ అగ్ర తారాలపై ఆమె చేసిన విమర్శలకు చాలా మంది సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇచ్చారు. అయితే ఆ కామెంట్స్ మళ్ళీ పక్క దారి పట్టడంతో కంగనా ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

కరణ్ జోహార్, మహేష్ భట్ వంటి వారిపై నెపోటిజమ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన కంగనా ఆ తరువాత తాప్సిపై ఊహించని విదంగా కామెంట్స్ చేసింది. స్వర భాస్కర్, తాప్సి వంటి వారు బాలీవుడ్ మాఫియాకు మద్దతుగా ఉంటారని వారు బి-గ్రేడ్ యాక్టర్స్ అంటూ ఘాటుగా స్పందించడంతో ఆ విమర్శలపై ఇప్పుడు నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకొచ్చిన తాప్సి పై నువ్వు ఇలా కామెంట్స్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఓ వర్గం నెటిజన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. దీంతో ఆమె మొదలుపెట్టిన ఉద్యమంపై ఊహించని విదంగా ఎఫెక్ట్ పడింది. మరి కంగనా ఇలాంటి పరిస్థితులలో ఏ విదంగా అడుగులు వేస్తుందో చూడాలి.