151 సీట్లు గెలిచిన వ్యక్తితో 151 సినిమాలు చేసిన హీరో కలిశాడు

సైరా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న చిరు, రెండు వందల కోట్ల మార్క్ ని టచ్ చేశాడు. ఈ జోష్ ని కంటిన్యూ చేస్తూ మెగాస్టార్ సైరా సినిమాని రీసెంట్ గా తెలంగాణ గవర్నర్ కి చూపించాడు. ఇది అయిన రెండు రోజులకి సైరా సినిమాని ఏపీ సీఎం జగన్ కి చూపించడానికి రెడీ అయ్యాడు. ఈ విషయమై చిరు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. భార్యతో సహా వెళ్లిన చిరంజీవిని, జగన్ మోహన్ రెడ్డి దంపతులు కలిసి ఆహ్వానించారు.

chiranjeevi meets jagan

జగన్ నివాసంలో జరిగిన ఈ మీటింగ్ లో సైరా నరసింహ రెడ్డి మూవీని చూడాలని సీఎం జగన్ ను చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది. రిలీజ్ సమయంలో ఏపీలో జగన్ సైరాకి అదనపు షోల అనుమతి ఇచ్చారు. నిజానికి ఈ మీటింగ్ కి చరణ్ కూడా వెళ్లాల్సి ఉండగా, చరణ్ అనివార్య కారణాల వళ్ల ఆగిపోయాడు. ఈ మీటింగ్ సంబంధించిన ఫొటోస్ బయటకి వచ్చిన తర్వాత మెగా అభిమానులు, వైసీపీ అభిమానులు కలిసి 151 సీట్లు గెలిచిన వ్యక్తితో 151 సినిమాలు చేసిన హీరో కలిశాడు అంటూ వైరల్ చేస్తున్నారు.