ఈ ‘ఒక్కడు’ టీజర్ తోనే రికార్డులు సృష్టించాడు

ఘట్టమనేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. నవంబర్ 22 సాయంత్రం రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరూ టీజర్ చూసిన తర్వాత మహేశ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులంతా ఖుషి అయి ఉంటారు. ఒక కంప్లీట్ మాస్ మసాలా సినిమా చూసి చాలా రోజులు అయ్యింది, ఆ లోటుని తీర్చడానికి అనీల్ రావిపూడి అండ్ టీం రెడీ అవుతున్నారు. టీజర్ లో మహేష్ డైలాగ్స్ అండ్ లుక్ కి సూపర్బ్ ఫీడ్బ్యాక్ వచ్చింది.

sarileru neekevvaru

సర్ప్రైజింగ్ రెస్పాన్స్ రావడంతో సరిలేరు నీకెవ్వరూ టీజర్, బయటకి వచ్చిన కొన్ని గంటల్లోనే ట్రెండ్ అయ్యింది. వ్యూస్, లైక్ ల విషయంలో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసిన సరిలేరు నీకెవ్వరూ టీజర్, 40 గంటల్లోనే 20 మిలియన్ రియల్‌టైమ్ వ్యూస్ సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 40 గంటల పాటు కంటిన్యూగా యుట్యూబ్‌లో నెం1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉండడం మహేశ్ బాబుకి మాత్రమే దక్కిన రికార్డు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు.