Tollywood: సునీల్ క‌నబ‌డుట‌లేదు.. టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన మేక‌ర్స్‌!

Tollywood: టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ సునీల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం క‌న‌బ‌డుట‌లేదు. ఈ చిత్రానికి ఎమ్‌. బాల‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో, స‌తీష్ రాజు, దిలీప్ కూర‌పాటి, దేవి ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సుక్రాంత్ వీరెల్ల‌, శ‌శిత కోన‌, యూగ్రామ్ త‌దితరులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

ఇప్పుడు తాజాగా Tollywoodఈ చిత్రానికి సంబంధించి ప్రైవేట్ ఐ పేరుతో ఓ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ సినిమాలో సునీల్ డిటెక్టివ్ పాత్ర‌లో డిటెక్టివ్ రామ‌కృష్ణ గా క‌నిపించ‌నున్నారు. ఈ టీజ‌ర్‌లో ఓ కేసును చేధించడానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఓ చీక‌టి గదిలో భూత‌ద్దంతో ఏదో క‌నిపెట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు సునీల్ క‌నిపించాడు. ఇక Tollywoodఈ చిత్రానికి అందించిన నేప‌థ్య సంగీతం ఎంతో అల‌రిస్తోంది. ఇక ఈ కామెడీ క్రైం థ్రిల్ల‌ర్‌ను స్పార్క్ ఓటీటీ సంస్థ ఏప్రిల్ 16న రిలీజ్ చేస్తుంది.