భయమేస్తోంది.. నా సేఫ్టీ నాకు ముఖ్యం

లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో సెలబ్రెటీలు షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్స్‌లు జరుపుకోవాలని కేంద్రం నిబంధనలు పెట్టగా.. కొంతమంది నిర్మాతలు అవి పాటించడం లేదు. ఇటవల శృతిహాసన్ పాల్గొన్న ఒక షూటింగ్‌లో కోవిండ్ నిబంధనలు పాటించలేదట. దీంతో దీనిపై శృతిహాసన్ పెట్టిన ట్వీట్ వైరల్‌గా మారింది.

కరోనా అనేది చాలా సీరియస్ హెల్త్ రిస్క్ అని, కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని చెప్పింది. సెట్స్‌లో నిబంధనలు పాటించనప్పుడు ఒక వ్యక్తిగా, ఒక నటిగా నా హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకునే రైట్ నాకుందని శృతి తెలిపింది. ఇటీవలే సోషల్ మీడియాలో తాను మాస్క్ ధరించి ఉన్న ఫొటోను ఈ భామ షేర్ చేసింది. ఈ సందర్భంగా సెట్స్‌లో కరోనా నిబంధనలు పాటించకపోతే చాలా భయమేస్తోంది’ అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో శృతిహాసన్ నటిస్తోంది. ఎస్‌ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఠాగూర్ మథు నిర్మిస్తున్నారు. దీంతో పాటు ఎస్పీ జననాథ్ డైరెక్షన్‌లో వస్తున్న లాభం అనే సినిమాలో శృతి నటిస్తోంది.