Tollywood: న‌టి శ్రీ‌సుధ కేసుపై శ్యామ్‌కెనాయుడుకు సుప్రీం కోర్టు నోటీసులు..

Tollywood: సినీ న‌టి శ్రీ‌సుధ‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేసిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్యామ్‌కు బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో శ్రీ‌సుధ కేసు వేసింది. నెల‌రోజుల్లో నోటీసుల‌కు స‌మాధానం తెల‌పాల‌ని శ్యామ్ కెనాయుడిని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాంప్ర‌మైజ్ అయిన‌ట్లు న‌కిలీ డాక్యుమెంట్ల్ చెక్కులు డీడీలు రూపంలో 50ల‌క్ష‌లు ఇచ్చిన‌ట్లు Tollywoodశ్యామ్‌కెనాయుడు కోర్టుకు స‌మ‌ర్పించారు.

డాక్యుమెంట్లు చూసి శ్యామ్ కె నాయుడుకి నాంప‌ల్లి సెష‌న్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ర‌ద్దు చేయాలంటూ స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శ్రీ‌సుధ కేసు వేసింది. త‌న‌ను హ‌త్యా చేసేందుకు కుట్ర చేశార‌ని.. విజ‌య‌వాడ‌లో కారు యాక్సిడెంట్ చేశారంటూ సుప్రీంకోర్టుకు శ్రీ‌సుధ తెలిపింది. గ‌తంలో హైద‌రాబాద్‌లోని ఎస్సార్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో శ్యామ్‌కె నాయుడిపై Tollywoodశ్రీ‌సుధ కేసు పెట్టిన విష‌యం తెలిసిందే.