భారీ రేటు పెట్టి బంగ్లా కొన్న శ్రీదేవి కూతురు

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కోట్లు ఖర్చు పెట్టి భారీ బంగ్లా కొనుగోలు చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు ఇప్పటివరకు సరైన సక్సెస్ కాలేదు. దీంతో ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తూ సక్సెస్‌ను అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

JANHVI KAPOOR HOUSE COST
JANHVI KAPOOR HOUSE COST

అయితే సినిమాలకు సంబంధించిన వార్తలతో కాకుండా పర్సనల్ విషయాలకు సంబంధించిన వార్తలతో జాన్వీ కపూర్ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. గతంలో ఒకరితో లవ్ ఎఫైర్ పెట్టుకుని వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ.. ఇప్పుడు భారీ రేటుకు బంగ్లా కొనుగోలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ముంబైలో ఖరీదైన ఒక బంగ్లాను జాన్వీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో తండ్రి, చెల్లితో కలిసి ఆ బంగ్లాలోకి జాన్వీ అడుగుపెట్టనుంది.

ఇప్పుడు ఉన్న ఇల్లు కాస్త చిన్నదిగా ఉండటంతో.. భారీ రేటు పెట్టి పెద్ద బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. రూ.39 కోట్లతో ఈ బంగ్లా కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ఇంట్లో కొన్ని డిజైన్స్ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. సొంత డబ్బుతోనే జాన్వీ ఈ బంగ్లాను కొనుగోలు చేసిందని, సినిమాలతో పాటు యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులను కూడబెట్టుకుని ఈ ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిందని సమాచారం.