SPB హాస్పిటల్ బిల్లులపై రూమర్స్.. తనయుడు చరణ్ ఆగ్రహం

ఇండియన్ లెజండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం మరణం ప్రతి ఒక్కరినీ ఎంతగానో బాధిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో ఆయన హాస్పిటల్ బైల్స్ పై వస్తున్న రూమర్స్ కూడా అసంతృప్తికి గురి చేస్తున్నాయి. బిల్లు చెల్లించేవరకు ఎస్పీ బాలు భౌతిక కాయాన్ని కూడా ఇవ్వలేదని కథనాలు వెలువడడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఫైనల్ గా బాలు తనయుడు చరణ్ ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వక తప్పలేదు.

బాలు యొక్క 50రోజుల హాస్పిటల్ బిల్స్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులు చెల్లించారని వస్తున్న వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ చరణ దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని అన్నాడు. అసలే ఎంతో బాధపడుతున్న తరుణంలో ఈ విదంగా క్షోభ పెట్టడం ఎంతవరకు న్యాయం అంటూ రూమర్స్ ని స్ప్రెడ్ చేయవద్దని చరణ్ అలా వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. బిల్లుల కోసం ఎవరిని సంప్రదించలేదని వీలైనంత త్వరగా హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి ఈ విషయంపై క్లారిటీ ఇస్తామని చరణ్ వివరణ ఇచ్చారు.