‘బాలు’ గారిని ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటాను – ‘నందమూరి బాలకృష్ణ’!!

16 భాషల్లో 40,000 కి పైగా పాటలు పాడిన భారతదేశం గర్వించే గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి నిష్క్రమణ యావత్ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు బాలు గారితో ఎంతో అనుభందం ఉంది. ఆయన పాడిన నాన్నగారి పాటలు గాని నా పాటలు గాని వినని రోజుంటూ ఉండదు. ముఖ్యంగా భైరవ ద్వీపం లో ఆయన ఆలపించిన ‘శ్రీ తుంబుర నారద నాధామృతం’ పాటను ఎప్పుడు పాడుకుంటూనే ఉంటాను. అలా ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అలంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరం. బాలు గారి ప్రవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.