Tollywood: తాటి క‌ల్లు తాగిన సింగ‌ర్ సునీత‌, యాంక‌ర్ భార్గ‌వి..

Tollywood: ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత‌, యాంక‌ర్ భార్గ‌వి ఇటీవ‌లే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఒక టీవీ ఛానెళ్లు వాళ్లు వీరిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. హైద‌రాబాద్ శివార్లలోని ఓ రిసార్టులో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

అయితే ఆ రిసార్టులో తాటి చెట్లు ఎక్కువ‌గా ఉండడంతో గీత కార్మికులు తాటి క‌ల్లును తీస్తున్నారు. ఈ క్ర‌మంలో సింగ‌ర్ సునీత‌, యాంక‌ర్ భార్గ‌వితో పాటు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తోటి Tollywood క‌ళాకారులు తాటిక‌ల్లును గ్లాసులతో తాగారు.. తాగిన గ్లాసుల‌తో గీత కార్మికుడితో ఫోటోలు దిగారు.. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.