‘కన్నుమూసిన’ గాన గంధర్వుడు ‘ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం’..

గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం గత నెల రోజులకు పైగా ప్రాణాలతో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే చివరికి శుక్రవారం 1:04గంటలకు ప్రాణాలు విడిచారు. చాలా తేలికపాటి’ కోవిడ్-19 లక్షణాలతో ఆగస్ట్ 5వ తేదీన ఆస్పత్రిలో జాయిన్ అయిన బాలు వీలైనంత త్వరగా కొలుకుంటానని మళ్ళీ మీ ముందుగు ఆరోగ్యంతో వస్తానని అభిమానులకు ఒక వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు.

మెల్లగా కొలుకుంటున్నారని అనుకుంటున్న సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకి మరింత విషమంగా మారడం అభిమానులను షాక్ కి గురి చేసింది. ఎన్నో వేలాది పాటలు పాడి 50 ఏళ్ళ పాటు సంగీత ప్రపంచంలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 74ఏళ్ల బాలసుబ్రహ్మణ్యం ప్రాణాలు విడువడం అభిమానులను సినీ తారలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఎక్మో లైఫ్ సపోర్ట్ తో ఉన్న ఆయన నిన్న తీవ్ర జ్వరం రావడంతో స్పృహను కోల్పోయారు. అప్పటి నుంచి ఎంజీఎం వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడడానికి ఎంతగానో శ్రమించారు. కానీ చివరికి వారి కష్టం కూడా వృధా అయ్యింది.