శ్రీవారిని దర్శించుకున్న సినీ గాయకుడు మనో

నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు మనో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయనతో అభిమానులు ఫోటోలు దిగారు.