శర్వానంద్ ‘మనమే’ ఫస్ట్ సింగిల్ ‘ఇక నా మాటే’ విడుదల ఎప్పుడంటే

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ 35వ చిత్రం ‘మనమే. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.  ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత.

యూనిక్  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి  విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీని అందించారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందిస్తున్నారు.

మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి మేకర్స్  సిద్ధంగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ఇక నా మాటే పాటను మార్చి 28న విడుదల చేయనున్నారు. సాంగ్ పోస్టర్‌లో శర్వానంద్ షేడ్స్‌తో ట్రెండీ అవతార్‌లో ఆకట్టుకున్నారు. పోస్టర్ లో స్కేటర్ రైడింగ్ చేస్తూ కనిపించారు.

తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా
డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీవోపీ : విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: జానీ షేక్
పీఆర్వో: వంశీ-శేఖర్