డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ‘శ‌ర్వానంద్‌’, ‘రీతూవ‌ర్మ’ జంట‌గా కొత్త చిత్రం ప్రారంభం..

శ‌ర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లుగా శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ఈరోజు చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. షూటింగ్ కూడా నేటి నుండే ప్రారంభమ‌వుతుంది. ఈ చిత్రంలో `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. నాజ‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 


విడ‌దీయ‌లేని స్నేహం, ప్రేమ అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక‌క‌నుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.  

న‌టీన‌టులు:
శ‌ర్వానంద్, రీతూవ‌ర్మ‌, నాజ‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీకార్తీక్‌
నిర్మాత‌లు: ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు
బ్యాన‌ర్‌:  డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌
డైలాగ్స్‌:  త‌రుణ్ భాస్క‌ర్‌
మ్యూజిక్‌:  జాక్స్ బిజోయ్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సుజిత్ సారంగ్‌
ఎడిట‌ర్:  శ్రీజిత్ సారంగ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  ఎన్‌.స‌తీశ్ కుమార్‌
కాస్ట్యూమ్స్ స్టైలిస్ట్ :ప‌ల్ల‌వి సింగ్‌