శర్వానంద్ ‘మహా సముద్రం’ అఫీషియల్.. త్వరలోనే మరో అప్డేట్!!

ఫైనల్ గా శర్వానంద్ త్వరలో ప్రారంభించబోయే ఇంటెన్స్ లవ్ స్టొరీ మహా సముద్రం సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో సినిమాను భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

మహా సముద్రం సినిమా కోసం గత కొంత కాలంగా దర్శకుడు అజయ్ చాలా మంది స్టార్స్ ని కలిశాడు. కానీ ఆ కథ చేయడం రిస్క్ తో కడుకున్న పని అని పెద్దగా పట్టించుకోలేదు. ఇక శర్వానంద్ ఆలోచనల ప్రకారం కథలో కొన్ని మార్పులు చేయడంతో శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మహాసముద్రం శర్వానంద్ కెరీర్‌లోనే ఒక మరపురాని చిత్రాలలో ఒకటిగా ఉంటుందని నిర్మాతలు పేర్కొన్నారు. మిగతా తారాగణం గురించి అలాగే ఫస్ట్ లుక్ పై అప్డేట్స్ త్వరలోనే వెలువడనున్నట్లు చెప్పారు. ఇక లవర్ బాయ్ సిద్ధార్థ్, బాలీవుడ్ నటి అదితి రావు హైదారి కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలతో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.