సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. థియేటర్లలోకి ప్రముఖ హీరో సినిమా

కరోనా ప్రభావం, లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లు, థియేటర్లు ఆగిపోవడంతో సినీ ప్రేక్షకులు ఓటీటీల వైపు మోగ్గు చూపారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక ధియేటర్లు కూడా ఓపెన్ అయినా.. కొత్త సినిమాలు ఏం లేకపోవడంతో పాత సినిమాలనే మళ్లీ ప్లే చేస్తున్నారు.

లాక్‌డౌన్ తర్వాత తొలిసారి ఒక ప్రముఖ హీరో సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. యంగ్ హీరో సాయిథరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జీ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

నభా నటేష్ ఈ సినిమాలో సాయిథరమ్ తేజ్ పక్కన హీరోయిన్‌గా నటించగా.. కొత్త డైరెక్టర్ సుబ్బు దీనిని తెరకెక్కించారు. ఎస్ఎస్ తమన్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమాలో రోమాన్స్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో విడుదల అవుతున్న ఈ తొలి సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.