ఇలాంటి సమయంలో మౌనంగా ఉండాలి: ‘సంజయ్ దత్’ భార్య ఎమోషన్ పోస్ట్!!

సంజయ్ దత్ భార్య మానాయత దత్ మరోసారి సోషల్ మీడియాలో ప్రస్తుతం తన భర్త పరిస్థితి గురించి వివరణ ఇచ్చారు. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కఠిన సమయాల్లో ఆలోచించి అడుగులు వేయాలని అన్నారు. ఇటీవల సంజయ్ దత్ ఉపిరితిత్తుల క్యాన్సర్‌కి గురైన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు పలు షూటింగ్ లతో బిజీగా ఉన్న సంజయ్ ఇక కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

సంజయ్ భార్య మనాయత దత్ సంజు అనారోగ్యం గురించి మాట్లాడుతు ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. “ఇప్పుడు, సంజయ్ దత్ చికిత్స పొందుతున్నాడు. కొన్నిసార్లు మౌనంగా ఉండవలసి ఉంటుంది, ఎందుకంటే మనస్సులో మరియు హృదయంలో ఏమి జరుగుతుందో ఏ పదాలు వివరించలేవు” అని ఒక కిటికీ దగ్గర కూర్చున్న ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. అలాగే నెటిజన్స్ కూడా ఆమె పోస్ట్ పై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సంజు భాయ్ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.