ఖల్నాయక్… ఈసారి టైగర్ తో వస్తున్నాడు

బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్‌ ప్రస్తుతం ప్రస్థానం సినిమా చేస్తున్నాడు. రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ మూవీ అయిపోయాక సంజు, మరోసారి రాజ్ కుమార్ హిరానీతో చెయ్ కలపడానికి రెడీ అయ్యాడు. సంజయ్ దత్ కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్‌. 2003లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్‌గా 2006లో లగే రహో మున్నాభాయ్ వచ్చి ఘన విజయం సాధించింది. ఈ రెండు సినిమాలని తెరకెక్కించిన రాజ్‌ కుమార్‌ హిరానీ, మున్నాభాయ్ సిరీస్ కి రెండో సీక్వెల్‌ మున్నాబారు ఎంబీబీఎస్‌ 3 చిత్రం తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంజయ్ దత్‌, రాజ్‌ కుమార్‌ హిరానీ కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని కన్ఫర్మ్ చేశాడు.

ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, మున్నాభాయ్ సిరీస్ లోని మూడో సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలో ఫైనల్‌ అయ్యే అవకాశం ఉంది. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో ప్రారంభిస్తాం. అర్షద్‌ వార్సి తన పాత్రలో నటిస్తారు అని సంజరు దత్‌ చెప్పాడు. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 2న గాంధీ జయంతికి లగే రహో మున్నాభాయ్ చిత్ర యూనిట్ సంజయ్ దత్‌, విద్యా బాలన్‌, అర్షద్‌ వార్సి, బొమ్మన్‌ ఇరానీ, దిలిప్‌ ప్రభవాల్కర్‌ కలిసి ఒక స్పెషల్ వీడియో చేశారు. దీన్ని గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే సంజయ్ దత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఖల్నాయక్ సినిమాకి కూడా సీక్వెల్ చేయడానికి సంజయ్ దత్ ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే ఖల్నాయక్ సినిమాలో టైగర్ ష్రాఫ్ నటించే అవకాశం ఉంది