డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కి బెయిల్

కన్నడ సినిమా పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో హీరోయిన్స్ సంజన గర్లానీ, రాగిణి ద్వివేదిలు గత కొద్దిరోజుల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో వీరిని విచారించిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నెలలో వీరిద్దరు అరెస్ట్ అవ్వగా.. బెయిల్‌పై బయటికొచ్చేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో కోర్టు బెయిల్ పిటిషన్లు నిరాకరిస్తూ వస్తోంది.

sanjana

అయితే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయనని, బయిల్ మంజూరు చేయాలని గత నెలలో సంజనా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించగా.. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో డ్రగ్స్ కేసులో సంజనాకు ఊరట కలిగినట్లు అయింది.

డ్రగ్స్ కేసులో పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా రావాల్సిందేనని కోర్టు షరతు విధించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో పాటు రూ.3 లక్షలను బాండ్‌గా సమర్పించాలని కోరింది. బెయిల్ పైవిడుదల అయిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించే అవకాశముంి.