రౌడీ బేబీగా సందీప్ కిషన్

ఒక సినిమాలోని ఏదైనా పాట హిట్ అయితే ఆ పాటతో సినిమాలు తీయడం దర్శక, నిర్మాతలకు ప్యాషన్‌గా మారిపోయింది. గతంలో ఇలాంటి సినిమాలు చాలా అనేకం రాగా.. ఇప్పుడు అలాంటి సినిమా తెలుగులో మరోకటి రాబోతోంది.

SANDEEP KISHAN

కోలీవుడ్ హీరో ధనుష్-సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ‘మారి 2’ సినిమాలోని ‘రౌడీ బేబి’ సాంగ్ ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్ సాధించిన తొలి సౌతిండియా సినిమా పాటగా అది నిలిచింది. ఈ పాటకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా.. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో సాయిపల్లవి, ధనుష్ డ్యాన్స్ చాలా డిఫరెంట్‌గా, చాలా కొత్తగా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినాఇంకా చూడాలనిపించేలా ఈ పాటను తెరకెక్కించారు.

ఈ పాట టైటిల్‌తో ఇప్పుడు ‘రౌడీ బేబీ’ అనే సినిమా రాబోతోంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇందులో హీరోగా నటించనుండగా.. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నేహా శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటించనుండగా.. ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా.. నిర్మాత ఎంవీవీ సత్యరారాయణ ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. సహ నిర్మాత జీవీ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. కోన వెంకట్‌ ముహూర్తం సీన్‌కు గౌరవ దర్శకత్వం వహించాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజేంద్రప్రసాద్, హర్ష, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో నటించనున్నారు.