Tollywood: స‌మంత శాకుంతలం నుంచి సరికొత్త అప్‌డేట్‌..

Tollywood: స‌మంత అక్కినేని న‌టిస్తున్న తాజా చిత్రం శాకుంత‌లం. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. పురాణేతిహాస క‌థాంశాన్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈచిత్రం నుంచి మోష‌న్ టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌గా..

samantha akkineni

తాజాగా Tollywoodఈ సినిమాకు సంబంధించి స‌రికొత్త అప్‌డేట్‌ను ప్ర‌క‌టించింది. శాకుంతలం మొద‌టి షెడ్యూల్ మార్చి 15నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. హైద‌రాబాద్‌లోని ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ చిత్రంకు సంబంధించి పెద్ద సెట్‌ను వేస్తున్నారు. మ‌హాభార‌తం నుంచి ఈ క‌థ సిద్ద‌మైంది. మ‌హాక‌వి కాళిదాస్ ఐకానిక్ డ్రామా అభిఘ్న శ‌కుంత‌లం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ Tollywoodచిత్రంలో హీరోయిన్ ఈషారెబ్బా, మ‌ల‌యాళ హీరో దేవ్ మోహ‌న్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం స‌మంత ఫ్యామిలీమ్యాన్‌2 వెబ్‌సిరీస్ లో న‌టిస్తుంది.