Tollywood: ఊర్వశి’తో జత కట్టిన “సమంత”

Tollywood: హిప్నాటిజం నేపథ్యంలో… హీరోయిన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం “సమంత”. బహు భాషా ప్రవీణుడు-ఎమ్.ఎస్.సి గోల్డ్ మెడలిస్ట్ ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ Tollywood చిత్రంలో సిరి కనకన్ అనే ముద్దుగుమ్మ టైటిల్ రోల్ పోషించగా… లిరిన్, రమేష్ నీల్, చరణ్, శ్రీకాంత్, పృథ్వి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పలు ఇండియన్- ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి ఎంపికైన ఈTollywood చిత్రం “ఊర్వశి ఓటిటి” ద్వారా నేటి (మార్చ్ 6) నుంచి ఉర్రూతలూగించనుంది.

ఆద్యంతం అత్యంత ఆసక్తికర కథనంతో రూపొందిన “సమంత” చిత్రం దర్శకుడిగా తనకు మంచి పేరు తీసుకురావడంతోపాటు.. ఇందులో నటించిన, పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు తీసుకువస్తుందని ముఖేష్ కుమార్ ఆశాభావం వక్తం చేశారు. ఈ Tollywood చిత్రానికి సంగీతం: వి.ఆర్.ఎ. ప్రసాద్, ఎడిటింగ్: సాయికుమార్ ఆకుల, కెమెరా: అశోక్ రత్నం, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, నిర్మాణం: లియో ఫిల్మ్ కంపెనీ, రచన-ఆలోచన-దృశ్యరూపం: ముఖేష్ కుమార్.