‘ఆదిపురుష్’ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టిన సైఫ్ అలీ ఖాన్

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’కు సంబంధించిన చిన్న వార్తలు అయినా సరే.. అది హాట్‌టాపిక్‌గా మారుతుంది. తాజాగా ఈ సినిమా గురించి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టాడు. ఇందులో రావణుడి క్యారెక్టర్లను పాజిటివ్ యాంగిల్‌లో చూపించబోతున్నారనే విషయం బయటపెట్టాడు. విలనిజంలోనూ కొంచెం పాజిటివ్ యాంగిల్ ఉంటుందని సైఫ్ చెప్పాడు. రావణుడి మీద రెస్పెక్ట్ పెరిగేలా కొన్ని సీన్లు ఉంటాయని సైఫ్ అలీ ఖాన్ చెప్పిన విషయాలను బట్టి చూస్తూ అర్థమవుతోంది.

SAIF ALI KHAN

ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలను పోషించనుండగా.. సీత పాత్రలో ఏ హీరోయిన్ నటిస్తుందనేది ఇంకా కాన్ఫామ్ కాలేదు. కృతిసనన్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ నటిస్తుండగా.. దీని తర్వాత మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరెక్కించబోయే సినిమాల్లో నటించనున్నారు.

ఆ తర్వాత ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ నటించే అవకాశముంది. ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ఆదిపురుష్ మేకర్స్ ప్రకటించారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్‌ ఆదిపురుష్‌ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ విలువిద్యను సైతం నేర్చుకుంటున్నారు. 3డీలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం.