మహేష్‌పై సాయిపల్లవి హాట్ కామెంట్స్

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది హైబ్రిడ్ పిల్ల సాయిపల్లవి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. తెలుగులో ‘ఫిదా’ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ‘ఫిదా’ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల-నాగచైతన్య కాంబోలో వస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమాతో పాటు రానా హీరోగా వస్తున్న ‘విరాట పర్వం’ సినిమాలో కూడా నటిస్తోంది.

SAI PALLAVI

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సౌతిండియా సూపర్ స్టార్ మహేష్ బాబుపై సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘మహేష్ బాబు ఎంతో గ్లామర్‌గా కనిపిస్తారు. ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా కనిపించదు. ఒక వ్యక్తి ఇంత అందంగా కనిపించడం అసాధ్యం’ అని వ్యాఖ్యానించింది. ఒక్కోసారి ఆయన ఫోటోలను తాను జూమ్ చేసి చూస్తుంటానని, ఆయన చర్మంపై ఒక్క చిన్న మచ్చ కూడా కనిపించదని చెప్పింది. మహేష్ బాబు చర్మం ఎపుడు మెరుస్తూ ఉంటుందని పొగిడేసింది.

ఒక మనిషి ఇంత పర్పెక్ట్‌గా ఎలా ఉంటాడనే సందేహాపడుతూ ఉంటానని చెప్పింది. ఎలాంటి సందర్భంగా అయినా మెరిసిపోవడం ఆయన స్కిన్ స్పెషాలిటీ అని సాయిపల్లవి ప్రశంసలు కురిపించింది. కాగా ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళంలో ‘పావకథైగల్’ అనే వెబ్‌సిరీస్‌లో సాయిపల్లవి నటిస్తోంది