National: బ్రేకింగ్ న్యూస్‌.. ఆసుప‌త్రిలో చేరిన స‌చిన్‌!

National: స‌చిన్ టెండూల్క‌ర్ ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా ఈ విషయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. దీంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్‌లో ఉంటూ వైద్యుల సూచ‌న‌ల‌తో క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్నాన‌ని అన్నారు. కాగా వారం రోజుల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయ‌న తాజాగా ఆసుప‌త్రిలో చేరారు.. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో తెలిపారు.

మీరు చూపుతున్న ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు.. అభిమానుల ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను. పూర్తిస్థాయిలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉండ‌డంతో వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరాను.. త్వ‌ర‌లోనే ఇంటికి చేరుకుంటాన‌ని భావిస్తున్నాను.. ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సుర‌క్షితంగా ఉండాలి అంటూ ట్వీట్ చేశారు.