సుశాంత్ రాజ్‌పుత్ నన్ను వాడుకున్నాడు

బాలీవుడ్ డ్రగ్స్ స్కాండల్ లో ఇరుకున్న రియా చక్రవర్తి, చనిపోయిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆత్మహత్య చేసుకోని మరణించిన సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు ఉందని, డ్రగ్స్ సరఫరా చేసేందుకు తనను వాడుకున్నాడని రియా చక్రవర్తి చెప్పింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి, డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై రిమాండ్ లో ఉన్న రియా చక్రవర్తికి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తికి సంబంధించిన బెయిల్‌ పిటిషన్‌ విచారణను బాంబే హై కోర్టు రేపటికి వాయిదా వేసింది.

బెయిల్‌ కోరుతూ రియా దాఖలు చేసిన పిటిషన్‌లో సుశాంత్‌ గురించి నమ్మశక్యం కాని విషయాలు వెల్లడించింది. ‘సుశాంత్‌ డ్రగ్స్‌ కోసం తనతో క్లోజ్‌గా ఉండే వారిని అంటే అతను నన్ను, నా సోదరుడిని వాడుకున్నాడు. ఇందుకు సంబంధించి అతడు ఎలాంటి ఎలాక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ని వదల్లేదు. దాంతో ఆధారాలు లేవు. ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నాం’ అని రియా విచారం వ్యక్తం చేసింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీ నిన్నటితో ముగియగా… కోర్ట్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగించింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించింది. తాజాగా వేసిన బెయిల్ పిటిషన్ భవితవ్యం రేపు తేలిపోతుంది.