కంపెని నిర్మాణం లో వస్తొన్న “మాఇష్టం”

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రధారులు గా , సుప్రీం కోర్టు సెక్షన్ 377 రద్దు చేసిన తర్వాత ఇండియా లో మొట్ట మొదటి లెస్బియన్ నేపథ్యం లో క్రైమ్ డ్రామా గా “మా ఇష్టం” చిత్రం రూపొందింది.
సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఏప్రిల్ 8 వ తారీఖు థియేటర్లలో విడుదల అవ్వనున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది.

అబ్బాయి, అమ్మాయి మధ్య కాకుండా, ఇద్దరు అమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది అన్న థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం భారత దేశం లోనే మొట్ట మొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రం గా మన ముందుకి రాబోతోంది.