ఆర్జీవీ డ్రీమ్ ప్రాజెక్ట్ పోస్ట‌ర్ రిలీజ్‌!‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ 2019లో అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ దావూద్ ఇబ్ర‌హీం జీవితం ఆధారంగా ఢీ కంపెనీ వెబ్‌సిరీస్‌ను తీస్తాన‌ని చెప్పాడు. ఇది త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. అయితే ఈ సిరీస్ ప్ర‌క‌టించిన త‌ర్వాత ప‌లు కార‌ణాల‌తో ఆగిపోయింది. అయితే ఇటీవ‌లే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ప్ర‌క‌ట‌న చేశారు వ‌ర్మ‌.. త‌న లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సిరీస్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ఈ నెల 15న విడుద‌ల చేస్తాన‌న్న ఆర్జీవి.. ఆ స‌మ‌యానికే పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

rgv web series

శుక్ర‌వారం ఢీ కంపెనీ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌గా.. ఆ పోస్ట‌ర్లో త‌న లైఫ్‌టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 23న విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఈ వెబ్‌సిరీస్ కేవ‌లం ఆయ‌న జీవితానికి సంబంధించిన బ‌యోపిక్ మాత్ర‌మే కాద‌ని, ఈ బ్రాండ్ కింద ఎంతో మంది గ్యాంగ్ స్ట‌ర్స్ బ‌తికార‌ని, అలానే ఇదే బ్రాండ్ కింద ఎంతోమంది చ‌చ్చార‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు ఆర్జీవీ. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్‌ను స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగ‌ర్ నిర్మిస్తున్న‌ట్టు ఆర్జీవీ పేర్కొన్నారు.