Bollywood: బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత డైరెక్ష‌న్‌లో మ‌రోసారి జోడీగా ర‌ణ్‌వీర్‌-అలియా..

Bollywood: బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్‌సింగ్‌, బ్యూటీ అలియాభ‌ట్ జంట‌గా తెర‌కెక్కిన గ‌ల్లీబాయ్ చిత్రం ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.. అలాగే ఈ చిత్రంలోని న‌టించిన వారికి ప‌లు పుర‌స్కారాలు ద‌క్కాయి. ఈ చిత్రం ప‌లు అంత‌ర్జాతీయ చిత్ర‌త్సోవాల్లో ప్ర‌ద‌ర్శ‌త‌మైంది. అయితే గ‌ల్లీబాయ్‌తో హిట్ కొట్టిన ర‌ణ్‌వీర్‌-అలియా మ‌రోసారి జంట‌గా న‌టించ‌నున్నార‌ట‌.

ఈ కాంబో చిత్రాన్ని Bollywood బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్‌జోహార్ నిర్మిస్తున్న‌ట్లు వార్తాలు వెలువ‌డుతున్నాయి. అలాగే క‌ర‌ణ్‌జోహారే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ట‌.. ఈ చిత్రం ఓ ప్రేమ క‌థా చిత్ర‌మ‌ని స‌మాచారం. అలియా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌ర‌ణ్ జోహార్ ర‌ణ్‌వీర్‌- అలియా జంట‌గా త‌ఖ్త్ అనే చిత్రాన్ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. దీన్నే ప‌ట్టాలెక్కించే ప‌నిలో నిమ‌గ్న‌మై Bollywood క‌ర‌ణ్ జోహార్ ఉన్న‌ట్లు స‌మాచారం.