నేను చనిపోవడానికి 30 శాతం ఛాన్స్ ఉంది.. కన్నీళ్లు పెట్టుకున్న రానా

గత కొంతకాలంగా రానా ఆరోగ్యంపై అనేక కథనాలు వస్తున్నాయి. రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, దాని కోసం విదేశాల్లో చికిత్స తీసుకోవడానికి వెళ్లాడనే వార్తలు హాల్ చల్ చేశాయి. రానా తల్లి లక్ష్మీ కిడ్నీ దానం చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఇటీవల రానా బాగా సన్నబడటంతో ఆరోగ్య సమస్య అంటూ వచ్చిన వార్తలు నిజమేనని అందరూ అనుకున్నారు. అయితే ఈ వార్తలపై రానా ఎప్పుడూ స్పందించలేదు.

తాజాగా హీరోయిన్ సమంత నిర్వహిస్తున్న స్యామ్ జామ్‌లో పాల్గొన్న రానా.. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై స్పందించాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి ఈ షోలో రానా పాల్గొన్నాడు. ఈ షోలో తన ఆరోగ్య సమస్యల గురించి రానా సంచలన విషయాలు బయటపెట్టాడు.

పుట్టినప్పటి నుంచే తనకు బీపీ ఉందని, దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుతుందని రానా చెప్పాడు. తన కిడ్నీలు పాడవుతాయని, మెదడులో నరాలు చిట్లీపోవడం 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారన్నాడు. ఈ విషయాలు చెప్పే క్రమంలో రానా కంటతడి పెట్టాడు. దీంతో ఇన్ని సమస్యలు ఉన్నా రానా థైర్యంగా ఉన్నాడనే రానా రియల్ హీరో అని ఫ్యాన్స్ చెబుతున్నారు.