పవన్ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరో

ప్రస్తుతం పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తుండగా.. దీని షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పవన్ పాల్గొంటుండగా.. త్వరలో ఇది ముగియనుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ లాయర్‌గా కనిపిస్తుండగా.. అంజలి, శృతిహాసన్, నివేదా థామస్‌లు నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ నటించడంతో ఈ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

PAWAN KALYAN

ఈ సినిమా విడుదల కాకుండానే పవన్ మరో సినిమాకు ఓకే చెప్పేశాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులోకి రీమేక్ కానుంది. ఇందులో పవన్ కల్యాణ్ హీరోగా నటించనుండగా.. దగ్గుబాటి రానా కీలక పాత్రలో నటించనున్నాడు. ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో పవన్‌, రానాతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. సితార ఎంటర్‌టైన్‌మ్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్నారు.

ఇక థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇప్పటికే పవన్ నాలుగు సినిమాలకు ఓకే చెప్పగా.. ఇది ఐదో సినిమా. అయ్యప్పనుమ్ కోషియుమ్ కథ విషయానికొస్తే…ఒక ఊరిలో ఒక మాజీ మిలిటరీ అధికారి, పోలీస్ అధికారికి మధ్య జరిగే ఆధిపత్య పోరును ఈ సినిమాలో చూపించారు. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య పోరు జరిగితే ఎలా ఉంటుందనేది ఈ కథ.