కోలీవుడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్?

టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా RRR బిగ్గెస్ట్ హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత ఎలాంటి సినిమాలతో వస్తారనేది అంచనాలకు అందడం లేదు. ఎన్టీఆర్ అయితే మాటల మంత్రకుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా ఎవరికి కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు.

ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. తని ఒరువన్ దర్శకుడు మోహన్ రాజా, చరణ్ తో సినిమా చేయాలని గత రెండేళ్ల నుంచి ట్రై చేస్తున్నాడు. తని ఒరువన్ తెలుగులో ధృవగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఎలాగైనా చరణ్ డేట్స్ దక్కించుకోవాలని మోహన్ రాజా ఇటీవల ఒక పాన్ ఇండియా కథను చెప్పినట్లు టాక్ వస్తోంది. ఇక రామ్ చరణ్ కూడా కథవైపు ఫుల్ ఇంట్రెస్ట్ తో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే విషయంలో క్లారిటీ రాలేదు. RRR, ఆచార్య సినిమాల ముగిసిన అనంతరం చరణ్ తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.