కోరిక తీరింది.. రకుల్ కామెంట్స్

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరంటే రకుల్ అని ఎవరైనా చెబుతారు. తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటోన్న హీరోయిన్ కూడా రకూల్‌నే. తెలుగుతో పాటు తమిళంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న రకుల్.. కోలీవుడ్‌లో కూడా స్టార్ హీరోల అందరి సరసన సినిమాలు చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ‘మేడే’ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. అబితాబ్‌తో నటించాలనేది తన కల అని, ఇప్పుడు ఆ కోరిక తీరిందని రకూల్ చెబుతోంది. అమితాబ్, అజయ్ దేవగణ్ కలిసి నటిస్తున్న ‘మేడే’ సినిమాలో రకూల్ కో-ఫైలట్‌గా నటించనుంది.

అజయ్ దేవగణ్ ఫైలట్‌గా నటించనుండగా.. రకూల్ కో-ఫైలట్‌గా కనిపించనుంది. గతంలో అజయ్ దేవగణ్‌తో కలిసి ఒక సినిమాలో నటించానని, ఇప్పుడు మళ్లీ ఆయనతో కలిసి చేయడం ఆనందంగా ఉందని రకుల్ చెబుతోంది. అయితే డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.