రాజు గారి గది3 సెన్సార్ పనులు కంప్లీట్…

ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న రాజు గారి గది సినిమా నుంచి థర్డ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది. అవికా ఘోర్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 18న ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమయ్యింది. రీసెంట్ గా వచ్చిన రాజు గారి గది3 ట్రైలర్ సినీ అభిమానులని ఆకట్టుకుంది. చోటా కె. నాయుడు కెమెరా పనితనం, ఈ సినిమాకి ప్రధాన బలంగా మారింది. రాజు గారి గది3 ఇంత రిచ్ గా ఉంది అంటే దానికి కారణం చోటా పనితనమే. రాఘవ లారెన్స్ లాగా తెలుగు భాషలో వరసగా ఒకే సినిమాకి సీక్వెల్స్ చేస్తున్న దర్శకుడు ఓంకార్ మాత్రమే.

raju gari gadhi3

రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ రాజు గారి గది3 సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫికేట్ తెచ్చుకున్న రాజు గారు గది3, 120 నిమిషాల డ్యూరేషన్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. రెండు గంటల కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మజీ, ఊర్వశి, ధన్రాజ్, అజయ్ ఘోష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి షబీర్ స్వరాలు అందిస్తున్నారు.