ఊపిరి పీల్చుకున్న రజనీకాంత్ ఫ్యాన్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా షూటింగ్‌లోని యూనిట్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో.. రజనీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో రజనీకాంత్ కరోనా టెస్టు చేయించుకోగా.. నెగిటివ్ అని రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సినిమా యూనిట్ మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో షూటింగ్ నిలిపివేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రజనీ ‘సిరుతై’ అనే సినిమా చేస్తున్నాడు.

RAJANIKANTH

లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ జరుగుతుండగా.. నయనతార, రజనీపై కొన్ని సీన్లను తెరకెక్కించారు. తాజాగా షూటింగ్‌లోని సభ్యులందరికీ కరోనా టెస్టు చేయగా.. 8 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో అర్థాంతరంగా షూటింగ్ ఆపివేశారు.

షూటింగ్ ఆగిపోవడంతో రజనీకాంత్ చెన్నైకి తిరిగి వెళ్లారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. మీనా, ఖుష్బూ, న‌య‌న‌తార కీలక పాత్రలలో న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, కీర్తి సురేష్ కూడా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. డి.ఇమ్మ‌న్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.