పదేళ్లుగా డేటింగ్.. ఇప్పుడు బ్రేకప్

టెలివిజన్ కపుల్ పూజా గోర్, రాజ్ సింగ్ జంట విడిపోయింది. దాదాపుగా పదేళ్లుగా ఈ జంట డేటింగ్‌లో ఉండగా.. ఇప్పుడు విడిపోవాలని ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పూజా గోర్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. అయినప్పటికీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని, ఒకరినొకరం గౌరవించుకుంటామని పూజాగోర్ తెలిపింది. 2020లో ఎన్నో మార్పులు వచ్చాయని, వాటిలో మంచితో పాటు చెడువి కూడా ఉన్నాయంది. గత కొద్ది నెలలుగా తామిద్దరి రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఎన్నో రూమర్స్ వచ్చాయని, కానీ కష్టమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించింది.

ఇక మీదట తమ జీవితాలు వేర్వేరు మార్గాల్లో నడుస్తాయని, తమ మధ్య ప్రేమ, గౌరవం మాత్రం జీవితాతం ఇలాగే ఉంటాయని పూజా గోర్ తెలిపింది. తన జీవితం మీద ప్రభావం చూపిన వ్యక్తుల్లో అతడు ఎంతో ముఖ్యమైన వాడని, దానికి అతడికి తాను ఎప్పుడూ ధన్యవాదాలు చెబుతానంది. ఈ బ్రేకప్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి తనకు కొంత సమయం, ధైర్యం అవసరం అయ్యాయంది.

ప్రస్తుతం ఆమె బ్రేకప్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్ సింగ్ అరోరాకు బ్రేకప్ చెప్పడంతో అతడితో కలిసి ఉన్న ఫొటోలను పూజాగోర్ డిలీట్ చేసింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరి బ్రేకప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.