నంద్యాల రవికి ల‌క్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన‌ శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత‌, నిర్మాత కె.కె.రాధామోహ‌న్!!

ద‌ర్శ‌కుడు, ర‌చయిత నంద్యాల ర‌వి ప్ర‌స్తుతం కరోనా తీవ్రత నుంచి కోలుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత‌, నిర్మాత కె.కె.రాధామోహ‌న్ ల‌క్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అంతే కాకుండా డాక్ట‌ర్ జాఫ‌ర్‌తో మాట్లాడుతూ ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుంటున్నారు. ప్లాస్మా డొనేట్ చేయ‌డంలో కూడా రాధామోహ‌న్ కో ఆర్డినేట్ చేశారు.