కోవిడ్ టెస్ట్ మహారాణిని నేనే.. ప్రీతి జింటా ఎన్ని సార్లు టెస్ట్ చేయించుకుందంటే?

https://www.instagram.com/p/CGj6FGVh_Fa/?utm_source=ig_web_copy_link

ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని అయిన నటి ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం దుబాయ్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరణం ఉండేలా ఏర్పాటు చేసిన బయో బబుల్ నిబంధనలకు ప్రీతి కట్టుబడి బయటకు వెళ్లడం లేదు. అలా చేస్తే, కొన్ని రోజులకు ఆమెకు సాధారణ కోవిడ్-19 పరీక్షలలు చేయించుకో తప్పదు.

మంగళవారం, ఆమె వీడియో పోస్ట్ చేసింది, అందులో మెడికల్ స్టాఫ్ మెంబర్ ప్రీతితో టెస్ట్ లు చేయించుకోవడం చూడవచ్చు: ” టెస్ట్ చేస్తున్న ఆమె ఆశ్చర్యంగా ఉంది, కోవిడ్ పరీక్ష చేయటానికి ఆమె ఉత్తమ వ్యక్తి. ఇక నేను ఇప్పటికే 20 సార్లు టెస్ట్ చేయించుకున్నాను. ఒక విధంగా నేను కోవిడ్ టెస్ట్ క్వీన్ అంటూ ప్రీతి సరదాగా వ్యాఖ్యానించింది. ఇక ప్రస్తుతం తన జట్టు సభ్యులను సపోర్ట్ చేస్తూ స్టేడియంలో హడావుడి చేస్తున్న ప్రీతి జింతా ఎలాగైనా ఈ సారి కప్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 6వ స్థానంలో కొనసాగుతోంది.